వైయస్ ఇమేజ్, కుట్ర కోణాన్ని వదిలి పెట్టని జగన్

పదవిలోనూ, అధికారంలోనూ లేని జగన్ను నేరుగా ఏమీ అనలేరు గనుక... వైఎస్ను అడ్డం పెట్టుకుని ఆయనపై బురదజల్లేందుకు తెగిస్తున్నారని, అలాగని వైఎస్ను నేరుగా విమర్శించినా జనం ఊరుకోరు గనుక, కోర్టును అడ్డం పెట్టుకుని అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్నంతా ప్రజలు గమనించే సరికి... ఒకవైపు వైఎస్ను తమవాడేనంటూ సొంతం చేసుకుంటూ, మరోవైపు జగన్ను మాత్రం ఇబ్బంది పెట్టేలా డబుల్ గేమ్ మొదలు పెట్టారని సాక్షి తన వార్తాకథనంలో విరుచుకుపడింది.
సీబీఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరును చేర్చడం ఒక ఎత్తయితే, దానిపై ప్రభుత్వ పెద్దలే ఆడుతున్న వింత నాటకాలు మరో ఎత్తు అని, ఆ సంగతే తమకు తెలియదంటూ తొలుత బుకాయించారని, తర్వాతేమో, ఎఫ్ఐఆర్లో ఎక్కడా వైఎస్ పేరు లేదని స్వయంగా సీఎం కిరణే, అది కూడా ఢిల్లీ గడ్డపైనే ప్రకటించారని అన్నది. దర్యాప్తు జరిగేది జగన్ కంపెనీలపై మాత్రమేనంటూ పచ్చి అబద్ధాలు చెప్పారని వ్యాఖ్యానించింది. 'రాజశేఖరరెడ్డితో కలిసి జగన్ కుట్ర, మోసం, అవకతవకలు, నమ్మకద్రోహం వంటి నేరాలకు పాల్పడ్డారు" అని సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఉన్నా ప్రభుత్వాధినేతకు మాత్రం అది కన్పించడం లేదని, మరికొందరు మంత్రులైతే, సీఎంగా వైఎస్ తీసుకున్న నిర్ణయాలతో తమకు సంబంధం లేదు పొమ్మన్నారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications