తెలంగాణపై సిఎం కిరణ్ కుమార్ పరోక్ష వ్యాఖ్యలు

భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. భావోద్వేగాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఆందోళనల విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మీడియాపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మీడియాకు పరిమితులు అవసరమని ఆయన అన్నారు. గణేష్, రంజాన్ వంటి ఉత్సవాలను సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవడం హర్షణీయమని ఆయన అన్నారు.
ప్రాంతీయ భావోద్వేగాలతో తలెత్తిన ఉద్యమాలను శాంతిభద్రతల సమస్యగా చూడరాదని ఆయన అన్నారు. రాజకీయ పరిష్కారం కనుక్కునే వరకు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications