నాకు ఆ శక్తి ఉంది: జగన్ ఫిర్యాదుపై రోశయ్య

Rosaiah
న్యూఢిల్లీ: యువకులు చేసే ఆరోపణలను నిందలు భరించే శక్తి తనకు ఉందని తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య అన్నారు. తనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ఫిర్యాదుపై ఆయన శుక్రవారం సాయంత్రం ఆ విధంగా స్పందించారు. ప్రత్యారోపణలు చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. ఇటీవల జగన్‌ ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి, రోశయ్యపై ఫిర్యాదుచేశారు. కాంగ్రెస్‌కు విశ్వాసపాత్రుడిగా ఉన్నందువల్లే అమీర్‌పేట భూకేటాయింపు కేసులో ఏసీబీ కోర్టు ద్వారా క్లీన్‌చిట్‌ ఇప్పించి, రోశయ్యను గవర్నర్‌ను చేశారని అన్నారు.

జగన్‌లాంటి యువకులు మాట్లాడిన మాటలమీద తాను వ్యాఖ్యానించనని స్పష్టం చేశారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు ఓబుళాపురం గనుల అక్రమాలపై వేసిన సీబీఐ దర్యాప్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది కదా అని విలేకర్లు గుర్తుచేయగా - ఆయన ఆచితూచి స్పందించారు. ''నేను ఆగస్టు 31 సాయంత్రం 4 గంటల వరకు రాజకీయవాదిని. 4.22 గంటలకు తమిళనాడు గవర్నర్‌ని. అందువల్ల ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు సిద్ధంగా లేను. అది నా విధి కూడా కాదు'' అని అన్నారు.

తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకొచ్చిన రోశయ్య రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ, హోంమంత్రి చిదంబరంలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమిళనాడు భవన్‌కు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+