తెలంగాణ రాదని కెసిఆర్కు తెలుసు: శైలజానాథ్

హైదరాబాద్ అంటే సంపాదించుకునే యంత్రం కాదని, హైదరాబాదు అంటే తాము మనుషులుగా చూస్తామని, మానవ సంబంధాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. మనుషులుంటేనే మర్యాద, గౌరవమని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యతను కాపాడడానికి ఎలాంటి యుద్ధానికైనా సిద్ధఫడతామని ఆయన అన్నారు. తెలుగు భాష, రక్తసంబంధాల కోసమే తాము సమైక్య రాష్టాన్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. తాము కన్నెర్ర చేస్తే వేర్పాటువాదుల గుండెలు ఆగుతాయని ఆయన హెచ్చరించారు. కెసిఆర్ లాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications