ఇద్దరు తెలుగుదేశం శాసనసభ్యుల రాజీనామా

TDP Logo
అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డిపై తెలుగుదేశం శాసనసభ్యులు కత్తులు నూరుతున్నారు. రఘువీరా రెడ్డి తీరుకు నిరసనగా అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ పెనుకొండ శాసనసభ్యుడు బికె పార్థసారథి, పుట్టపర్తి శాసనసభ్యుడు పల్లె రఘునాథ రెడ్డి లేఖలను ఫాక్స్ ద్వారా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపించారు.

జిల్లా మంత్రి రఘువీరా రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను పట్టించుకోవడం లేదని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని విమర్శిస్తూ ఆ ఇద్దరు శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. జిల్లా అధికారులు కూడా మంత్రికే వత్తాసు పలుకుతున్నారని వారు విమర్శిస్తున్నారు. రఘువీరా రెడ్డి తీరుకు వ్యతిరేకంగా తమ తమ నియోజకవర్గాల్లో వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+