Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి భయం

Chiranjeevi and Kirankumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గత ప్రజారాజ్యం పార్టీ అధినేత, కాంగ్రెసు కొత్త నేత చిరంజీవి భయం పట్టుకుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిరంజీవిని వెంటేసుకుని రాష్ట్రంలో పర్యటించే పథకాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఉమ్మడి కార్యక్రమాల వల్ల తనకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కావడానికి బొత్స సత్యనారాయణ, చిరంజీవి - ఇద్దరు కూడా ఉవ్విళ్లూరుతున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కలిసి పనిచేయాలనే అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు.

వారిద్దరి బంధాన్ని విడదీసి, తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పకడ్బందీ వ్యూహాన్నే రచించి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని ఢిల్లీకి పంపించాలనేది ఆయన వ్యూహమని చెబుతున్నారు. చిరంజీవిని ఎఐసిసిలోకి తీసుకోవాలని ఆయన అధిష్టానం పెద్దలకు సూచించారని చెబుతున్నారు. చిరంజీవిని ఢిల్లీకి పంపించడం వల్ల తనకు ఒకరి అడ్డు తొలగడమే కాకుండా, ఇద్దరు నాయకుల ఉమ్మడి కార్యక్రమాలకు గండి కొట్టి తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఆయన అనుకుంటున్నారని చెబుతున్నారు.

ఇదే సమయంలో గత ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు పదవులు ఇచ్చి తనకు అనుకూలంగా మార్చుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి అడుగుతున్నారు. కానీ, ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మందికి ఇతర పదవులు కట్టబెట్టవచ్చుననే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+