మోడీ మూడు రోజుల సద్భావనా దీక్ష విరమణ

కాగా, ముస్లిం పెద్దలు ఇచ్చిన టోపీని పెట్టుకోవడానికి మోడీ నిరాకరించడం వివాదంగా మారింది. తన దీక్ష మాత్రమే ముగిసిందని, మిషన్ కొనసాగుతుందని నరేంద్ర మోడీ దీక్ష విరమణ సందర్భంగా అన్నారు. సొంత ఇమేజ్ను పెంచుకోవడానికి తాను ఈ దీక్ష చేపట్టలేదని, దేశం కోసం తాను దీక్షను చేపట్టానని ఆయన అన్నారు. తన దీక్షలో ఏ విధమైన రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా తనకు దేశం ముఖ్యమని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీని సుష్మా స్వరాజ్ ప్రశంసలతో ముంచెత్తారు. బిజెపికి నరేంద్ర మోడీ ఉన్నారని, కాంగ్రెసులు ఎవరున్నారని ఆమె అన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థిగా వెంకయ్యనాయుడు మోడీని అభివర్ణించారు. బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీయేనని, అందులో సందేహం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications