ఆంధ్రా-తెలంగాణకు మధ్య ఆందోళనకారుల గోడలు

మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ వద్ద తెలంగాణవాదులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నాలు చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి డికె అరుణ దిష్టిబొమ్మను సైతం తగులపెట్టారు. మెదక్ జిల్లా జహీరాబాద్ సమ్మెలో పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు పాల్గొన్నారు. రహదారుల నిర్బంధం కారణంగా ముంబై నుండి హైదరాబాదు రావాల్సిన భారీ వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. నల్గొండ జిల్లా చిట్యాలలో టిడిపి, టిఆర్ఎస్ మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చిన టిడిపి నేతలను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టిడిపి జెండాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించారు. మరోచోట మద్దతు పలకడానికి వచ్చిన వైయస్సార్సీ పార్టీ నేతలను తెలంగాణవాదులు తరిమి కొట్టారు. పలుచోట్ల రహదారుల పైకి వచ్చిన బస్సులను ధ్వంసం చేశారు. తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నల్గొండ జిల్లాలోని పోచంపల్లి మండలం కొత్తగూడ గ్రామంలో జరిగిన దిగ్బంధంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications