ఐఐటి కాన్పూర్ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

అహ్మద్ తన గదిలో ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని అతని మిత్రులు చూశారు. వారు తమ అధికారులకు సమాచారం అందించడంతో హాస్టల్ వార్డెన్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి మరణించడాన్ని ఆతను గమనించాడు. అహ్మద్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఆ సంఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని వేశారు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఐఐటి - కాన్పూర్ డైరెక్టర్ సంజయ్ ధాండే చెప్పారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఐఐటి - కె రిజిస్ట్రార్ సంజీవి కసాల్కర్ చెప్పారు.












Click it and Unblock the Notifications