జగన్ కంటే చంద్రబాబే నయం: ధర్మాన ప్రసాద్

dharmana prasad rao
శ్రీకాకుళం: వైయస్సార్సీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే పాలన అనుభవం ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే నయమని మంత్రి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. తన సోదరుడు, ఎమ్మెల్యే కృష్ణదాస్ ఎంత చెప్పినా వినకుండా కాంగ్రెసు పార్టీని వీడారని ప్రజలే అతనికి గుణపాఠం చెబుతారన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ను సిబిఐ అరెస్టు చేయడం ఖాయమన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలను చూసి నాయకత్వ లక్షణాలను నేర్చుకోవాలని హితవు పలికారు. జగన్‌కు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గతే పడుతుందన్నారు. దేశ ప్రజల కోసం పాటుపడే కాంగ్రెసులో ఉండాలా లక్ష కోట్ల ప్రజాధనాన్ని అక్రమార్జన చేసిన జగన్ వెంట ఉండాలా కార్యకర్తలు నిర్ణయించుకోవాలన్నారు.

కాంగ్రెసు ప్రజల పార్టీ అని, ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి పల్లకీ మోసే బోయీలమయ్యే అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెసు పార్టీని వీడిన వారు ఎప్పటికైనా తిరిగి రావాల్సిందేనన్నారు. ప్రభుత్వం అమ్ములపొదిలో మరికొన్ని సంచలన పథకాలున్నాయని అవసరమైతే పేదలకు ఉచితంగా బియ్యం అందజేసే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. కాంగ్రెసు ప్రజల కోసం ఎంతగా పాటుపడుతున్నప్పటికీ కొన్ని పత్రికలు సొంత అజెండాను అమలు చేస్తూ ప్రభుత్వంపైన, నాయకులపైన విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తనకు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో ఎలాంటి విభేదాలు లేవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+