తెలంగాణపై తేల్చుకోవాల్సింది పార్టీలే: లగడపాటి

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణపై తేల్చుకోవాల్సింది రాజకీయ పార్టీలేనని, ప్రభుత్వం కాదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. సమస్య పరిష్కారానికి తమ పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, మిగతా పార్టీలు కూడా అంతర్గత చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశం జాతీయ సమస్య అని ఆయన అన్నారు. తెలంగాణవాదం ఉందా, లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదని ఆయన అన్నారు. తెలంగాణ కావాలని, సమైక్యాంధ్ర కావాలని రకరకాల ఆకాంక్షలున్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

సకల జనుల సమ్మె వల్ల ప్రయాణాలు రద్దు చేసుకుని ఎవరి ప్రాంతాల్లో వారు ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె కాదని, సకల జనుల కష్టాల సమ్మె అని ఆయన అన్నారు. ప్రజలపై ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ప్రజలను కష్టపెడుతున్నారని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలు సుఖపడుతుండగా, తెలంగాణలో ప్రజలు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల పనులను పక్కన పెట్టి ఉద్యోగులు సమ్మె చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం సహనం, ఓపికలతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+