వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మోచేతి నీళ్లు: రాములమ్మపై లగడపాటి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మోచేతి నీళ్లు తాగుతున్నారని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. కెసిఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై లగడపాటి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. విజయశాంతిని కెసిఆర్ మభ్యపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. విజయశాంతి రాములమ్మ సినిమాను ఓసారి చూసి తెలంగాణలో భూస్వాములు, దొరలు ఎలా పీడించారో తెలుసుకోవాలని ఆయన అన్నారు. సమ్మక్క, సారక్కలను ఎలా చేశారో తెలుసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధపోరాటానికి చెందిన పుస్తకాలను కొన్నిటిని మీడియా సమావేశంలో ప్రదర్శిస్తూ ఆయన తెలంగాణలోని దొరలు, భూస్వాములపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో దొరల దౌర్జన్యం సాగుతోందని ఆయన అన్నారు.

కెసిఆర్ కుటుంబం హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోందని ఆయన అన్నారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులకు గన్‌మెన్‌లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రౌడీషీటర్లతో అరాచకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ముందు కూర్చుంటానని, ఎవరు వస్తారో రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో విప్లవకారులను దొరలు, భూస్వాములను ఎలా చేశారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణను దొరలు, భూస్వాములు, రజాకార్లు పీడించారని, ఇప్పుడు కెసిఆర్ పీడిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలను దొరలు తమ కాళ్ల కింద నొక్కి పెట్టారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలే ఈ పరిస్థితి ఏమిటని అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.

దౌర్జన్యం చేస్తున్న కెసిఆర్ కుటుంబాన్ని ఏం చేయాలో ప్రజలు, ప్రభుత్వం ఆలోచించాలని ఆయన అన్నారు. యాభై శాతం మంది ప్రజలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని, ఆ శాతం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. అక్టోబర్ 7వ తేదీన సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధులర సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి పాలన పెట్టే ప్రశ్నే లేదని ఆయన అన్నారు. కెసిఆర్ వద్దకు ఏ విధమైన ప్రతిపాదనా రాలేదని, కెసిఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. కారులో ఎసి లేకున్నా తాను నాలుగు గంటల పాటు ఉన్నానని ాయన అన్నారు. హైదారాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా, ఉమ్మడి రాజధానిగా చేసే అవకాశాలు లేవని ఆయన అన్నారు. తాము చేతకానివాళ్లం కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ దొరతనం నుంచి బయటపడాలని ఆయన పిలుపునిచ్చారు.

English summary
Lagadapati fires at KCR and Vijayashanthi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X