Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ మీ అయ్య సొత్తా: సీమాంధ్రులపై కెసిఆర్ పైర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: హైదరాబాద్ సీమాంధ్రుల అయ్య సొత్తా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. హైదరాబాదును సీమాంధ్ర నాయకులు ఏమీ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. హైదరాబాదు తెలంగాణ సొత్తు అని, రాజధాని కట్టుకునే వరకు సీమాంధ్రులు ఇక్కడి నుంచి పాలన చేసుకోవచ్చునని ఆయన అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో సీమాంధ్రులు రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాదు మాదని సీమాంధ్రులు అంటే భగ్గుమంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంప గోవర్ధన్ గురువారం సాయంత్రం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రసంగించారు.

ప్రపంచంలో ఇటువంటి సకల జనుల సమ్మె ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. మనలో మనకే కలహాలు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సాధించకపోతే మనల్ని బతకనీయరని ఆయన అన్నారు. ఆరు నూరైనా సరే తెలంగాణ సాధించి తీరాలని ఆయన అన్నారు. బాన్సువాడలో పోటీ చేసే దమ్ము లేక తెలుగుదేశం కథలు పడుతున్నారని ఆయన అన్నారు. పది మంది శాసనసభ్యులు ఉంటేనే ఇంతగా ఉద్యమం ఉంటే, నూరు మంది ఎమ్మెల్యేలు

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చేత ఒక లేఖ ఇప్పించాలని అడిగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులకు చేత కావడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన ద్రోహం ప్రజలు మరిచిపోలేదని, దాంతోనే గత ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించారని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+