ప్రణబ్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాములమ్మ, పొన్నం

తెలంగాణ కోసం నిర్ధిష్ట కాలపరిమితి కావాలని తాము అధిష్టానాన్ని కోరలేదాని తక్షణమే తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయని, యాభయ్యారేళ్ల ఉద్యమమని స్వయంగా ప్రణబ్ చెప్పారన్నారు. తెలంగాణపై కేంద్రం పూటకో మాట మాట్లాడ వద్దని కోరారు. అలా అయితే తాము కాంగ్రెసు నేతలుగా తెలంగాణలో తిరిగే ప్రసక్తి ఉండదన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెసు ఇప్పటికీ అనేక సమస్యలకు పరిష్కారం చూపించిందని అలాంటిది తెలంగాణ ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అని చెప్పుకుంటున్నామని అదే జరగకుంటే చచ్చేది కూడా తామే అన్నారు. తెలంగాణ బాధ్యత కాంగ్రెసుదే అన్నారు. ఇతర రాష్ట్రాల డిమాండుతో తెలంగాణకు సంబంధం లేదన్నారు.
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ పూటకో మాట మాట్లాడుతుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇస్తామని వారే చెప్పారు. ఇప్పుడు ఇవ్వమని వారే చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మరోసారి మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీనికి సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications