తెలంగాణ నేతలు అధిష్టానాన్ని ధిక్కరిస్తారా?

అధిష్టానంపై నమ్మకముంచి వాళ్లు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. నేతలతో చర్చించారు. చర్చించిన ప్రతీసారి అధిష్టానం సానుకూలంగాస్పందించిందని చెప్పారు. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తన వైఖరి బహిరంగంగా ప్రకటించక పోవడం, కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేయక పోవడంతో టి-నేతలకు తెలంగాణ ప్రజలకు సర్ది చెప్పుకునే అవకాశం వచ్చింది. కానీ ప్రణబ్ వ్యాఖ్యల ద్వారా దాదాపు ఇవ్వమని తేల్చేశారు. దీంతో ఇప్పుడు వారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోనున్నారు చూడాల్సి ఉంది. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే తాము పార్టీని వీడటం తప్ప చేసేదేమీ లేదని వారు బహిరంగంగానే ప్రకటనలు గుప్పించారు. రాజ్య సభ సభ్యుడు కె కేశవ రావు, ఎంపీలు పొన్నం ప్రభాకరం, మందా జగన్నాథం, వివేక్, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానానికి తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెసు భూస్థాపితం కాక తప్పదని హెచ్చరికలు పంపించారు.
మరోవైపు సకల జనుల సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రం తెలంగాణను ఇప్పట్లో తేల్చలేమని చెప్పడంతో పలువురు కాంగ్రెసు నేతలు పార్టీ నుండి బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ప్రణబ్ ప్రకటన స్పష్టంగా కనిపిస్తుండటంతో పార్టీ నుండి బయటకు రాకపోతే ప్రజల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వారు పార్టీ వీడి గతంలో పలువురు ప్రకటించిన మాదిరిగానే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కొట్టి పారేయలేము. అయితే వీరు గతంలో మాదిరిగా మెత్తబడతారా లేక పార్టీని ధిక్కరిస్తారా అనేది త్వరలో తెలుస్తుంది.












Click it and Unblock the Notifications