తెలంగాణపై బాబును ఫిక్స్ చేయనున్న కాంగ్రెసు
అఖిల పక్ష సమావేశానికి ముందు కాంగ్రెసు తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు తన్పనిసరిగా ఓ వైఖరి అవలంబించాల్సి వస్తుందని అంటున్నారు. ఇంతకు ముందు పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు. అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు రెండేసి వెఖరులను చెప్పేసి తప్పుకున్నాయి. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెసు అధిష్టానం పార్టీకి ఒక్కరేసి ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించి పార్టీ వైఖరిని వెల్లడించాలని చెప్పే అవకాశాలున్నాయి.
తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెసు కోర్ గ్రూప్ మంగళవారం గానీ బుధవారం గానీ సమావేశమయ్యే అవకాశం ఉంది. గత రెండు నెలలుగా చేసిన సంప్రదింపులపై చర్చ చేసి ఈ సమావేశంలో కాంగ్రెసు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లీస్ పార్టీలు అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ వైఖరిని అఖిల పక్ష సమావేశంలో వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు చంద్రబాబు చిక్కులో పడక తప్పదని అంటున్నారు.