సిఎం కిరణ్పై ఆజాద్కు తెలంగాణ ఎంపీల ఫిర్యాదు

ఉద్యమ పరిస్థితులపై ఆజాద్కు పూర్తిగా వివరించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో కొనసాగుతున్న సమ్మె తీవ్రతను కూడా వివరించారు. అయితే తెలంగాణపై కేంద్రం, పార్టీ అధిష్టానం సీరియస్గా ఆలోచిస్తోందని త్వరలో నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆజాద్ ఎంపీలకు సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా ఆజాద్తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లారు. ఆజాద్తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. మరోవైపు తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరుతూ ఎంపీలు బుధవారం స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు.












Click it and Unblock the Notifications