హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డిపై చార్జిషీట్ వేసి తీరుతాం: సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డిపై నిర్ణీత వ్యవధిలో చార్జిషీట్ దాఖలు చేసి తీరుతామని సిబిఐ ధీమా వ్యక్తం చేసింది. సత్యం కేసులో తాము 45 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయగలిగామని, గాలి జనార్దన్ రెడ్డి కేసులో తాము 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయగలమని సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ మీడియా ప్రతినిధులతో అన్నారు.

అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సిబిఐ ప్రధాని నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. వారిని అరెస్టు చేసిన రోజునుంచి 90 రోజుల్లో వారిపై చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని సెప్టెంబర్ 4వ తేదీన సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. బళ్లారి నుంచి గాలి జనార్దన్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

English summary
The CBI said it is confident of filing charge sheet against former Karnataka minister Gali Janardhan Reddy and his cousin Srinivas Reddy in the illegal mining case within the stipulated period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X