జగన్, కెసిఆర్ కాంగ్రెసు గూటి పక్షులే: ఎంపీ లగడపాటి

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్రను తాము అడ్డుకోమని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రలో 90 శాతం మంది, తెలంగాణలో 50 శాతం మంది సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతున్నారన్నారు. తన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయన్నారు. ఉద్యమానికి తలొగ్గి తెలంగాణ ప్రకటించే అవకాశాలు లేవన్నారు. తమ పార్టీ అధిష్టానం నెలాఖరులోగా నిర్ణయం ప్రకటిస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెతో ప్రజలు బాగా విసిగి పోయారన్నారు. సమ్మె ఇంకా ఎంతో కాలం కొనసాగదన్నారు. దేశంలో ఇదివరకు రాష్ట్రాలను విడదీయడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications