నవ్వాలో ఏడ్వాలో అర్థం కావట్లేదు: బాన్సువాడపై కెటిఆర్

కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కై పోచారం మెజార్టీ భారీగా తగ్గించే కుట్ర పన్నాయన్నారు. ఎన్నికలు మేం ఏకపక్షమనే ఊహించామన్నారు. ఈ విజయం ద్వారా తెరాస పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని మరోసారి తేటతెల్లమైందన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెసుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఆదివారం మంత్రి దానం నాగేందర్ అనుచరులు తెరాస కార్యకర్తలు దాడి చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో టిడిపి పూర్తిగా ఉనికి కోల్పోయిందన్నారు. డిపాజిట్ కూడా రాదనే టిడిపి పోటీ చేయలేదన్నారు. టిడిపి, కాంగ్రెసు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
కాంగ్రెసు కేవలం డిపాజిట్ దక్కినందుకు సంతోషిస్తే అది సరికాదని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కె కేశవరావు అన్నారు. 2009 నాటి తెలంగాణ ప్రకటకు తమ పార్టీ కట్టుబడక పోవడం వల్లనే తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయారన్నారు. మంత్రి దానం దాడి సరికాదన్నారు.












Click it and Unblock the Notifications