పోచారం ఘన విజయం, పరువు దక్కించుకున్న కాంగ్రెస్

లక్ష ఓట్లు ఆధిక్యంతో గెలుస్తామని తెరాస ధీమాతో ఉన్నప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు. కాంగ్రెసుకు డిపాజిట్ కూడా దక్కదని తెరాస వర్గాలు భావించాయి. మరోవైపు కాంగ్రెసు డిపాజిట్ వస్తే చాలని భావించింది. కానీ శ్రీనివాస్ గౌడ్ డిపాజిట్ దక్కించుకోవడంతో కాంగ్రెసులోనూ ఉత్సాహం కనిపించింది. సకల జనుల సమ్మె తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి లక్ష మెజార్టీ వస్తుందని తెరాస భావించింది. బాన్సువాడలో 1,59,673 ఓట్లకు గాను 1,22,872ఓట్లు పోలయ్యాయి. 76.95 శాతం పోలింగ్ నమోదయింది. గత పోలింగ్ కంటే ఇది 2.05 శాతం తక్కువ.












Click it and Unblock the Notifications