బాబు ఆస్తులపై హైకోర్టుకు వైయస్ విజయమ్మ

ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, వాటి విలువ ఎంత తదితర అంశాలను అందులో పొందుపర్చారు. చంద్రబాబు సిఎం కాక ముందు ఆస్తులను అయ్యాక ఆయనకు గల ఆస్తులను అందులో వివరించారు. తన ఆస్తులపై ఆయన చేసిన ప్రకటన తప్పని ఆమె ఆరోపించారు. అందులో ఆమె బాబు తనయుడు లోకేష్ కుమారు, సినీ హీరో మురళీ మోహన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు పేర్లను పేర్కొన్నారు. అందులో 20 మందిని ప్రతివాదులుగా చేర్చారు. టిడిపి హయాంలో జరిగిన అక్రమాలన్ని చంద్రబాబు మూలంగా జరిగనవే అని ఆమె అందులో ఆరోపించారు. జగన్ పై సిబిఐ విచారణ జరుగుతున్న సమయంలో చంద్రబాబుపై వైయస్ విజయమ్మ హైకోర్టు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications