తెలంగాణపై జాప్యం వద్దు, బిల్లు పెట్టాలి: అద్వానీ

LK Advani
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత ఎల్‌కె అద్వానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జాప్యం చేయవద్దని ఆయన సూచించారు. వచ్చే శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. అద్వానీ రథయాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆయనకు రాష్ట్ర నేతలు ఘన స్వాగతం చెప్పారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ తదితరులు ఆయన స్వాగతం చెప్పారు.

అద్వానీ రెండు రోజలు పాటు రాష్ట్రంలో రథయాత్ర చేస్తారు. అది కూడా తెలంగాణ ప్రాంతంలోనే కావడం విశేషం. ఆదిలాబాద్ ఇచ్చోడ, నిర్మల్, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ దాకా ఆయన యాత్ర సాగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఉంటే వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు అప్పుడు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు నానుస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై యుపిఎ మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో ప్రజల్లో ఆవేదన ఉందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాము సాకారం చేస్తామని ఆయన అన్నారు. భారత్‌లో అవినీతిని అంతమొందించాలని, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని దేశంలోకి తీసుకురావాలని, ఆ నల్లధనంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+