బసవ తారకం ట్రస్టు ర్యాలీలో బాలయ్య వెంట రోజా

Balakrishna-Roja
హైదరాబాద్: బసవ తారకం ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాదులో మంగళవారం నిర్వహించిన ఓ అవగాహన ర్యాలీలో హీరో బాలయ్యతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత, ప్రముఖ సినీ నటి రోజా పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించక ముందు నుండి ఆమె జగన్‌కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అయితే రాజకీయాలు, సేవా కార్యక్రమాలు వేరనే భావనతోనే ఆమె ర్యాలీలో పాల్గొని ఉండవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ పైన ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా బసవ తారకం ట్రస్టు ర్యాలీ నిర్వహించింది. ఇందులో బాలయ్యతో పాటు రోజా, నగర కమిషనర్ ఎకె ఖాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కలిగించడానికే ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు.

క్యాన్సర్ చికిత్స పేదలకు అండగా ఉండాలని తన తండ్రి, దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారన్నారు. ఇందులో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారన్నారు. క్యాన్సర్ తప్పని సరిగా నయమయ్యే రోగమన్నారు. డాక్టర్లను సంప్రదించి వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స చేయించుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+