కూకట్‌పల్లిలో టిడిపి గెలుపు, కాంగ్రెసు రాళ్ల దాడి

Hyderabad
హైదరాబాద్: కూకట్‌పల్లి 117వ డివిజన్ కార్పోరేటర్ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దండమూడి వెంకట సామ్రాజ్యం ఘన విజయం సాధించారు. కాంగ్రెసు అభ్యర్థిపై 2167 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఆనందంలో మునిగి తేలింది. అయితే ఓటమి బాధలో ఉన్న కాంగ్రెసు కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కార్లు తదితర వాహనాలపై దాడి చేశారు. తెదేపా కార్యకర్తల పైనా దాడికి యత్నించారు. వారి దాడిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కాంగ్రెసు దాడిని చిత్రీకరిస్తున్న మీడియా పైన కూడా దాడి చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ దాడిపై టిడిపి నేతలు స్పందిస్తూ తాము గెలిచిన తర్వాత కాంగ్రెసు నేతలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించలేదన్నారు. వారు ఓటమిని జీర్ణించుకోలేక ఉద్దేశ్య పూర్వకంగానే దాడి చేశారన్నారు. తన విజయం టిడిపి వ్యవస్థాపక ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంకితమని గెలుపొందిన వెంకట సామ్రాజ్యం అన్నారు. కాంగ్రెసు నేతలు తమ కార్యకర్తలపై అమానుషంగా దాడి చేశారన్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+