చల్లారని పోలవరం మంట, అక్రమాలపై హైకోర్టులో పిటిషన్
సుప్రీం ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఎలా టెండర్లు వేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణపై తెలంగాణ తెదేపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే, చీమూ నెత్తురూ ఉంటే తమతో కలిసి రావాలి కానీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ కోసం పత్రిక, ఛానల్ రాకుంటే ఉద్యమానికి ఇంత ప్రచారం వచ్చేదే కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన పేపర్లను ప్రజలకు చూపించలేని దద్దమ్మలన్నారు. అసలు టిడిపి పోలవరానికి అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని ప్రశ్నించారు. తెరాస తరఫున టెండర్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి లేఖ రాస్తామని చెప్పారు. మరికొందరు నేతలు మరో అడుగు ముందుకేసి పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చంద్రబాబుపై వేసిన పిటిషన్పై నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తకుముంద టిడిపి నేతలు దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ తమ వద్ద పోలవరంలో, నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తి పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. తాము ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.
తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కలిసి పోలవరం టెండర్లలో పూర్తిగా అక్రమాలు జరిగాయని వాటిని నిలుపుదల చేయాలని కోరారు. టెండర్ల దస్త్రం నిబంధనలకు విరుద్ధంగా ప్ర్రైవేటు సంస్థలకు ఎలా ఖరారు చేస్తారని ఆయన గవర్నర్కు నివేదిక ఇచ్చారు. టెండర్ల అంశంపై ముఖ్యమంత్రితో పాటు కార్యదర్శులందరి పైనా పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. లేకపోతే గిరిజనులు నష్ట పోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ సిజిజిసి, సోమా కంపెనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. టెండర్లలో అక్రమాలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కోరాయి. ఎల్ 2గా ఉన్న తమను కాకుండా ఎస్ఇడబ్ల్యుకు కాంట్రాక్టు కేటాయించడాన్ని సోమా కంపెనీ పిటిషన్లో పేర్కోంది.