సిఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్సకు అధిష్టానం మెచ్చుకోలు

Botsa Satyanarayana and Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈసారి తమ ఢిల్లీ పర్యటనలో పార్టీ అధిష్టానం నుండి మంచి మార్కులు కొట్టేసినట్లుగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమాన్ని ధీటుగా ఎదుర్కొంటారనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు అధిష్టానం కిరణ్‌ను సిఎంగా, బొత్సను పిసిసి చీఫ్‌గా ప్రకటించింది. కానీ వారు ఈ రెండు అంశాలలో విఫలమయ్యారు. దీంతో గతంలో ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీ వెళ్లినప్పుడు అధిష్టానం జగన్ వర్గాన్ని నిలువరించడంలో వైఫల్యం చెందారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో ఇటీవల సిఎం, పిసిసి చీఫ్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడూ అధిష్టానం వారికి అక్షింతలు వేసింది. సమ్మెను విరమింప చేయకుంటే ఎలా అని ప్రశ్నించింది. బొత్స, కిరణ్ ఇద్దరిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె విరమింప చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారిని హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి.

వారు ఢిల్లీ వెళ్లి వచ్చాక సమ్మె విరమణ చర్యలకు పూనుకున్నారు. వివిధ ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమ్మె ప్రభావాన్ని క్రమంగా తగ్గించారు. రవాణా శాఖ మంత్రి అయిన బొత్స తన శాఖ ఉద్యోగుల సమ్మె విరమణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆర్టీసి సమ్మె నుండి ప్రారంభమైన సమ్మె విరమణ క్రమంగా అన్ని శాఖలకు విస్తరిస్తోంది. అదే సమయంలో బాన్సువాడలో డిపాజిట్ కూడా దక్కదనుకున్న కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి మంచి ఓట్లు వచ్చాయి. పిసిసి చీఫ్ బొత్స, తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు బాన్సువాడలో అభ్యర్థిని పోటీలో పెట్టవద్దని సూచించినప్పటికీ సిఎం కిరణ్ మాత్రం ససేమీరా అన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలలో ఓడినప్పటికీ ఫలితం కాంగ్రెసుకే సానుకూలంగా ఉండటంతో అధిష్టానం సిఎం కిరణ్ పట్ల ఈసారి సంతృప్తి కనబర్చినట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+