బాలనాగి రెడ్డి బెదిరించడం సరికాదు: కెసిఆర్ కూతురు

కాగా అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్డీఎస్ వద్ద మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు రైతులు ఇసుక మూటలు వేసి తమ ప్రాంతానికి నీళ్లు మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఇసుక బస్తాలను తీసుకు వచ్చి ఆర్డీఎస్ వద్ద వేశారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల రైతులు పెద్ద ఎత్తున ఆర్డీఎస్ వద్దకు తరలి వచ్చారు. ఇసుక మూటలు వేసి నీటిని అడ్డుకుంటే తమ ప్రాంతాలకు నీరు అందకుండా పోతుందని తద్వారా పంటలు ఎండిపోయి తాము తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని కర్నూలు రైతులు, తూములు పగుల గొట్టి నీరు వాడుకుంటున్నారని మహబూబ్ నగర్ రైతులు ఆరోపణలు చేసుకున్నారు.
ఇరు ప్రాంతాల రైతులు అక్కడకు రావడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన భారీగా పోలీసులను మోహరించారు. కాగా సంఘటనా స్థలానికి మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగి రెడ్డి వచ్చారు. ఆర్డీఎస్ వివాదంపై మంత్రి డికె అరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని ఇరుప్రాంతాల వారు సమానంగా పంచుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు.












Click it and Unblock the Notifications