వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సకల జనుల సమ్మె విరమణ, చర్చలు సఫలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: నలబై రెండు రోజుల తెలంగాణ సకల జనుల సమ్మెకు తెర పడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సోమవారం రాత్రి సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో 9 డిమాండ్లపై ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే, సమ్మె కాలానికి వేతనాలను అడ్వాన్స్‌గా చెల్లించడానికి ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. రేపు మంగళవారం నుంచి తెలంగాణ ఉద్యోగులు తమ విధులకు హాజరు కానున్నారు. నో వర్కు నో పేను నిర్దేశించే 177 జీవో అమలుపై మినహాయింపు కోరుతూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనుంది. సమ్మె విరమణ ఒప్పందం పత్రంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. 42 రోజుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవు కాలంగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

అంతకు ముందు పరిణామాలు ఇలా సాగాయి - సమ్మె విరమణకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులతో డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. తెలంగాణ ఉద్యోగులు పెడుతున్న కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆప్షనల్ సెలవుల జీతభత్యాలపై ఇరు పక్షాల మధ్య పీఠముడి పడినట్లు తెలుస్తోంది. తాము సమ్మె చేసిన 42 రోజులను విధులు నిర్వహించినట్లుగా పరిగణించి జీతభత్యాలు చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు ఎదురు కావచ్చుననే ప్రభుత్వ ఉద్దేశంతో చర్చలు ముందుకు సాగలేదు. నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే, అందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు సిద్ధంగా లేరు.

అలాగే, ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై కూడా ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదరడం లేదు. కేసులను ఎత్తేయాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేస్తుండగా, దశలవారీగా ఎత్తేస్తామని ప్రభుత్వం అంటోంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతల డిమాండ్లపై డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సితోనూ, ఆర్థిక శాఖ కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం దిగి రావడంతో సమస్య పరిష్కారమైంది.

English summary
Stalemate continued in talks between Diputy CM Damodara Rajanarsimha and Telangana employees JAC leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X