కెసిఆర్‌ను వెంటాడుతాం, ఆస్తులు చెప్పాల్సిందే: మోత్కుపల్లి

Mothkupali Narasimhulu
హైదరాబాద్: ఆస్తులు ప్రకటించే వరకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును తాము వెంటాడుతామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్ తన ఆస్తులను, తన కుటుంబ ఆస్తులను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిలాగా ప్రకటించాల్సిందేనని ఆయన అన్నారు. తమను శిఖండులుగా అభివర్ణించిన తెరాస నాయకులపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. రోజుకో పార్టీతో సంసారం చేసే కెసిఆర్, తెరాస పార్టీ నాయకులు రాజకీయ వ్యభిచారులని ఆయన అన్నారు. కాంగ్రెసుతో కొన్నాళ్లు, తెలుగుదేశం పార్టీతో కొన్నాళ్లు సంసారం చేశారని, ఇప్పుడు బిజెపితో సంసారం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తెరాస 4,500 కోట్ల రూపాయలకు విక్రయించిందని ఆయన ఆరోపించారు. ఆరోపణలను రుజువు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులకు 55 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని మోత్కుపల్లి అన్నారు. ఆ ఆస్తులను పేద ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారసు. రెండు సార్లు రాజీనామా చేసిన తమను తెలంగాణ ద్రోహులని అంటున్నారని, అసలు తెలంగాణ ద్రోహి కెసిఆర్ అని ఆయన అన్నారు. కెసిఆర్ రాజకీయ ప్రయోజనం కోసమే పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాదని ఆయన అన్నారు. రాజకీయ ఎత్తుగడలతో వ్యవహరిస్తున్న కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని ఆయన అన్నారు. పోలవరం టెండర్ దక్కించుకుని కెసిఆర్ సమ్మెను విరమింపజేసి తెలంగాణ ఉద్యోగులను ఫూల్స్ చేశారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు రావాలంటే చంద్రబాబు రావాలని తెరాస నాయకులు షరతు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ సాధనలో తెరాస శిఖండిలా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస అమ్ముడుపోయే పార్టీ అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+