అందులో కుట్ర జరిగి ఉండొచ్చు: మంత్రి శంకరరావు

P Shankar Rao
హైదరాబాద్: టిఎన్జీవో నేత స్వామి గౌడ్‌పై అక్రమాల ఫిర్యాదులో కుట్ర జరిగి ఉండవచ్చని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు గురువారం అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులే తెలంగాణ వారిపై ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు. సోమవారం నుండి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్లు చెప్పారు. ఇటు తెలంగాణ, అటు సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త తనపై సుమోటోగా కేసు స్వీకరించడం పట్ల ఆయన ఆవేదన చెందారు. తనపై సుమోటోగా కేసు స్వీకరించడం బాధాకరమన్నారు. కంటోన్మెంటు ఎమ్మార్వో సరిగ్గా పని చేయడం లేదని తనకు ప్రజల నుండి ఫిర్యాదు వస్తేనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశానన్నారు. కాగా అంతకుముందు తిరుమలగిరి తహశీల్దారును బదలీ చేయాలంటూ మంత్రి శంకరరావు పైఅధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త స్పందించి దానిని సుమోటోగా స్వీకరించింది. వివరణ ఇవ్వాలని మంత్రిని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+