రాజకీయాల్లో వ్యభిచారం చంద్రబాబుదే: తెరాస

చంద్రబాబువన్నీ దొంగ యాత్రలేనని, రైతులను అడ్డుపెట్టుకుని తెలంగాణలో అడుగు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, తెలంగాణలో చంద్రబాబు తిరగలేరని ఆయన అన్నారు. దళిత కార్డును అడ్డం పెట్టుకుని మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడితే నియోజకవర్గం ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. చంద్రబాబు తన ఆస్తులతో బహిరంగ చర్చకు రావాలని, తమ నేత కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు వస్తారని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆరిపోయే దీపమని నాయని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు ఎకరాల నుంచి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. కెసిఆర్ను విమర్సిస్తే సూర్యుడిపై ఉమ్మేయడమేనని ఆయన అన్నారు. సొంత మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, చంద్రబాబు కథలు చిన్నపిల్లాడికి కూడా తెలుసునని, చంద్రబాబును ప్రజలను నమ్మబోరని ఆయన అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
తెరాసపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆయన అన్నారు. రైతుల నడ్డి విరిచింది చంద్రబాబేనని ఆయన అన్నారు. రాష్ట్రమంతా స్తంభించిపోతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎక్కడు నిద్రపోయారని, ఎక్కడ పడుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో అయిపోయారని ఆయన అన్నారు. తెరాసను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులకు దమ్ముంటే చర్చలకు రావాలని, తామే సమావేశం ఏర్పాటు చేస్తామని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ను ఒక వ్యక్తి కోసం ఖరారు చేశారని, ఆ మనిషి ఎవరో ఎవరి కోసం ఆ టెండర్ ఖరారు చేశారో అందరికీ తెలుసునని చంద్రబాబు అంతకు ముందు అన్నారు. తెరాసను వసూల్ రాజా పార్టీగా ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications