కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస ప్రతిపాదనకు ఎర్రబెల్లి కొలికి

రాష్ట్ర అవతరణను వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం ఢిల్లీలోని ఎపి భవన్లో నల్లజెండా ఆవిష్కరించారు. రాజకీయాలే కేంద్రంగా పోరాడితే తెలంగాణ రాదని ఆయన అన్నాైరు. తెలంగాణ వచ్చే వరకు ఏ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షలో పాల్గొనడానికి ఆయనతో పాటు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన బాపూజీ కాంగ్రెసుకు, ఆంధ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారని, బాపూజీకి తమ మద్దతు ఉంటుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications