సిఎంతో విభేదించిన మంత్రులు, బహిరంగ వ్యాఖ్యలు

కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు కూడా రూపాయికి కిలో బియ్యం పథకాన్ని వ్యతిరేకించారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుతున్న క్రమంలో రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. తాను రూపాయికి కిలో బియ్యం పథకాన్ని సమర్థించబోనని ఆయన స్పష్టంగానే చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తొలి రోజే బియ్యంలో పురుగులు రావడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉద్దేశ్యపూర్వకంగా పురుగులు ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రూపాయికి కిలో బియ్యం పథకంపై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రయోజనం ఉండదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని, ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications