కొండారెడ్డి స్టోరీ: అంగీకరించిన జగన్ వర్గం ఎమ్మెల్యే

కొండారెడ్డి అనే వ్యక్తి పేరు పెట్టి ఎల్లో మీడియా విషం కక్కుతూ తప్పు కథనాలను రాసిందని అంటూనే ఇదంతా చూస్తుంటే లోపల జరిగిన విషయాలను సిబిఐ లీక్ చేస్తుందా అనే అనుమానం కలుగుతోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిబిఐ కార్యాలయం లోపల జరిగిన విషయాలు ఎల్లో మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ఆయన అడిగారు. ఈ మాటలను బట్టి ఎల్లో మీడియాగా అభివర్ణిస్తున్న వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు నిజమేనని అనిపించేలా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. జగన్ ఇంటి విషయంలో కూడా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ విషయాలపై సిబిఐ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని ఆనయ వ్యాఖ్యానించారున. జగన్ను అరెస్టున చేస్తారని ఎల్లో మీడియా పదే పదే రాయడం చూస్తుంటే ఈ అసత్య ప్రచారం వెనక కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. జగన్ను దెబ్బ తీయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో జగన్ ఒక సాక్షిగా మాత్రమే సిబిఐ ముందు హాజరయ్యారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications