బాబుపై దుమ్మెత్తిపోసిన అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి

Ambati and Laxmi Parvathi
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి విడివిడిగా విరుచుకపడ్డారు. చంద్రబాబు పాలకుల ఒళ్లో గుర్రు పెట్టి నిద్రపోతున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అధికార కాంగ్రెసు పార్టీతో అంటకాగుతూ ప్రభుత్వం గుండెల్ల నిద్రపోతానంటూ చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదని ఆయన అడిగారు. భారతావని చరిత్రలో ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.

గవర్నర్, స్పీకర్ ప్రభుత్వంతో లాలూచీ పడిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ సరిగా పనిచేసినా కిరణ్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన అన్నారు.

అధికార దాహంతో, కుర్చీ మీది వ్యామోహంతో చంద్రబాబు నాయుడు రైతు జపం చేస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఆకుపచ్చ కండువా వేసుకుని తిరిగినంత మాత్రాన ప్రజల చంద్రబాబును నమ్మబోరని ఆమె అన్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి కారణం చంద్రబాబేనని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+