వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ ఉగ్రవాది, ఉరి తీయాలి: పాక్ మంత్రి మాలిక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajmal Amir Kasab
అద్దు (మాల్దీవులు): ముంబై దాడి కేసులో నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్ ఉగ్రవాదేనని, అతన్ని ఉరి తీయాలని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నారు. సార్క్ సదస్సుకు హాజరైన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కసబ్‌ చర్యలతో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేదని, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కసబ్‌కు ఏ విధమైన మద్దతు లేదని ఆయన అన్నారు. సమఝౌత ఎక్స్‌ప్రెస్ పేలుడుకు పాల్పడినవారికి కూడా శిక్ష పడాలని ఆయన అన్నారు. ముంబై దాడుల కేసు త్వరితగతి పరిష్కారానికి తమ ప్రభుత్వం భారతదేశానికి సహకరిస్తుందని ఆయన చెప్పారు.

ముంబై దాడుల్లో పాకిస్తానీల పాత్ర ఉందని జుడిషియల్ కమిషన్ తగిన సాక్ష్యాధారాలు చూపితే నిందితుల ప్రాసిక్యూషన్‌కు తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఆ కమిషన్ భారతదేశానికి వెళ్లినప్పుడు న్యాయ ప్రక్రియకు దాని నిర్ధారణలు అత్యంత ప్రధానమైనవని, నిందితులను ప్రాసిక్యూట్ చేయడానికి అది సహాయపడుతుందని ఆయన అన్నారు. అతిథులుగా అంగీకరిస్తే జుడిషియల్ కమిషన్ ప్రతినిధులు మూడు, నాలుగు రోజులు భారతదేశంలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ కమిషన్ నివేదిక వస్తే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. జమాత్ ఉద్ దావా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు విడుదల చేయడంపై ప్రశ్నించగా పాకిస్తాన్ అత్యున్నత కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన సమాధానమిచ్చారు.

English summary
Pakistan's Interior Minister Rehman Malik has said that 26/11 attacker Ajmal Amir Kasab is a terrorist and should be hanged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X