వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు నేతలకు సిగ్గులేదు: రాములమ్మ మండిపాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayasanthi
మెదక్: తెలంగాణ ఇప్పట్లో తేల్చలేమన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పార్లమెంటులో తెలంగాణ అంశం వచ్చినప్పుడు ప్రధాని బొమ్మలా కూర్చొని ఇప్పుడు నోరు తెరిచారని విజయశాంతి మెదక్ జిల్లాలో విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యల ద్వారా 2014 వరకు తెలంగాణ రాదని తేలిపోయిందన్నారు. ప్రధాని తేల్చి చెప్పినా ఇంకా కాంగ్రెసు నేతలకు సిగ్గు లేదన్నారు. రెండో ఎస్సార్సీ అనేది తన దృష్టిలో ఉత్తి చెత్త అన్నారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయకుండా తాత్సారం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమౌతోందన్నారు.

ఆమె పార్లమంటు నియోజకవర్గ పరిధిలోని పలుగ్రామాల్లో కాలినడకన పర్యటించి అక్కడి పర్జల సాధకబాధలను స్వయంగా చూసి తెలుసుకున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని కుక్కలు కూడా తినే పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను లేఖ రాస్తానని, ఆ బియ్యాన్ని కూడా సిఎంకు పంపే ఏర్పాట్లు చేస్తానని చెప్పారు.

English summary
Medak MP Vijayasanthi lashes out at Telangana Congress leaders for Prime Minister Manmohan Singh statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X