వైయస్ను అనుమానించే రీతిలో విజయమ్మ: రేవంత్

కాకినాడ పోర్టు కేటాయింపులో ప్రభుత్వ వాటాను తగ్గించింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన విమర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి భూమి కేటాయింపు కూడా నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణలను కాంగ్రెసు ప్రభుత్వం ఏడున్నరేళ్ల పాలనలో నిరూపించలేకపోయిదని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ ఒప్పందాలపై వైయస్ ప్రభుత్వం మంత్రి ఉప సంఘంతో సమీక్ష జరిపించిందని ఆయన గుర్తు చేశారు. బ్రిటిష్ సంస్థ స్కైవేస్ నివేదిక ఆధారంగా శంషాబాద్ విమానాస్రయం రూపకల్పన జరిగిందని ఆయన చెప్పారు. కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలోనే విద్యుత్తు ఒప్పందాలు జరిగాయని ఆయన చెప్పారు. విజయమ్మ తన పిటిషన్లో చేసిన ఆరోపణలకు ఆయన వివరంగా సమాధానాలిచ్చారు.
రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విజయమ్మ కోర్టులో పిటిషన్ వేశారని తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. విజయమ్మ పిటిషన్ వల్ల ప్రజల్లోకి తప్పుడు భావనలు వెళ్తాయనే ఉద్దేశంతోనే తాము వివరణ ఇస్తున్నామని ఆయన చెప్పారు. సిబిఐ దర్యాప్తునకు తాము భయపడడం లేదని, హైకోర్టు ఆదేశాలను తాము తప్పు పట్టడం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications