వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నేతలు చిన్నపిల్లలు కాదు: యు టర్న్‌పై విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళితే భవిష్యత్తు ఉండదనే పలువురు శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు గూటికి చేరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. నచ్చజెప్పి రప్పించుకునేందుకు వారేం చిన్న పిల్లలు కాదని జగన్ అవినీతి గురించి తెలిసే వారు తిరిగి వస్తున్నారన్నారు. అక్రమాస్తులు కూడబెట్టేందుకు అప్పటి సర్కారు ఎందరికి సహకరించిందో చూస్తానని చెప్పారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మంత్రిగా ఉండి డబ్బు ఎలా సంపాదించురో తెలుసుకునేందుకు తాను శుక్రవారం మహేశ్వరంలో పర్యటిస్తానని చెప్పారు.

తెలంగాణను ఇతర రాష్ట్రాలతో ముడి పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పు లేదన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది చేసిన బలిదానాలు గ్రహించైనా రాష్ట్రం ప్రకటించాలన్నారు. రాష్ట్రం ఎప్పుడిస్తారో తనకు తెలియదని అది తెలిస్తే తాను ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యే వాడినన్నారు. అంతిమంగా తెలంగాణ కావాలనేదే తన ఆకాంక్ష అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి తన విశ్వసనీయత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లకూడదని సూచించారు.

English summary
Congress senior leader V Hanumanth Rao said today that YSR Congress Party president YS Jaganmohan Reddy camp MLAs are not childs for attract them with.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X