చేతులు కలుపుదాం: చైనా ప్రధానితో మన్మోహన్ సింగ్
మనం పొరుగువాళ్ళమే కాదు ఆసియాలో అభివృద్ధి చెందుతున్న కీలక దేశాలూ మనవేనని, కాబట్టి మనం ద్వైపాక్షికంగానూ, ప్రపంచ దేశాలతోనూ సహకరించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని మన్మోహన్సింగ్ చైనా ప్రధానితో అన్నారు. ప్రధాని వ్యాఖ్యలతో ఏకీభవించిన వెన్జియాబావో ఇరు దేశాలూ పరస్పర సహకారంతో ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. పరస్పర లబ్దికి ఇరుదేశాలూ కలిసి పని చేయాల్సిన అవసరాన్ని ఇద్దరు ప్రధానులూ అంగీకరించారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మన్మోహన్సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇరుదేశాల మధ్య అణుఒప్పందంపై వారు చర్చించినట్లు సమాచారం. కాగా నాలుగు రోజుల పాటు ఇండోనేషియా, సింగపూర్లో ప్రధాని మన్మోహన్ పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చాయి. అనంతరం మన్మోహన్ ఇండోనేసియా అధ్యక్షుడు సుశీలో బంబాంగ్ యుధోయోనో చర్చలు జరపనున్నారు.