వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకుంటా: శంకరరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankar Rao
ఖమ్మం: తన శాఖకు నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటానని జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు. బడ్జెట్‌లో తన శాఖకు కేటాయించిన నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రికి పలుమార్లు లేఖలు రాశానని, అయినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన అన్నారు. నిధులు విడుదల చేయకపోతే ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకుంటానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తనకు ఇష్టం లేకనే మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనడం లేదని ఆయన అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని తిమ్మాపూర్ గ్రామంలో 35 ఎకరాల 27 గుంటల దళితుల భూమిని ఒక మంత్రి వియ్యంకుడికి, మరో మంత్రి తమ్ముడికి కట్టబెట్టేందుకు మంత్రివర్గంలో తీర్మానం చేయడంపై తనకు ఇష్టం లేకనే మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటున్నానని ఆయన చెప్పారు. ఆ భూములను దళితులకు అప్పగించకపోతే కోర్టుకు ఎక్కుతానని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సిబిఐకి పెద్ద గిరాకీ ఇచ్చింది తానేనని ఆయన చెప్పుకున్నారు. అంతకు ముందు అధికారులతో నిర్వహించిన సమీక్షలో చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 387 కోట్లు రాష్ట్రానికి మంజూరైనట్లు ఆయన తెలిపారు. తన మంత్రివర్గ సహచరులు సహకరించకపోయినా తనపై వచ్చిన ఆరోపణల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

English summary
Textile minister P shankar Rao said that he will challenge CM on funds release to his department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X