జగన్ లాగే గాలికి ఎదురు గాలి, ఇద్దరు యు టర్న్
ఈ భేటీకి గాలి శిబిరానికి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఊహించినట్లుగానే డుమ్మా కొట్టారు. కానీ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, నేమీ చంద్రనాయక్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ హాజరయ్యారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు గాలి శిబిరం నుండి మరికొందరు ఎమ్మెల్యేలు బిజెపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గాలి ప్రస్తుతం జైలు గోడలకే పరిమితం కావడం వల్ల బిజెపిలో ఉండటమే మంచిదని పలువురు భావిస్తున్నారట. గాలితో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలలో సాధ్యమైనంత మందిని పార్టీలోకి రప్పించుకునేందుకు బిజెపి కూడా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇండిపెండెంట్గా నిలబడుతున్న శ్రీరాములుకు చెక్ చెప్పేందుకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పార్టీ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
బిజెపి ఎమ్మెల్యేని గెలిపిస్తేనే అక్కడి ప్రజలు స్వాతంత్ర్యం లభిస్తుందని ఆయన చెప్పారు. అదే పాయింటుతో ఆయన శ్రీరాములుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. యడ్డీతో పాటు ముఖ్యమంత్రి సదానంద గౌడ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప విస్తృత ప్రచారం చేయనున్నారు. కాగా గాలి శిబిరంలోని ఎంపీలు ఇద్దరు గురువారం కూడా శ్రీరాములు తరఫున ప్రచారం చేశారు.