వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌ను కలిసిన మరో ఇద్దరు జగన్ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన మరో ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు శనివారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. జగన్‌కు మద్దతు ఇస్తూ వస్తున్న శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాసు, కొర్ల భారతి విశాఖపట్నం విమానాశ్రయంలో స్పీకర్ మనోహర్‌ను కలిశారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు వరుసగా స్పీకర్‌ను కలుస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ కూడా రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తమ రాజీనామాలను ఆమోదించవద్దని జగన్ వర్గం శాసనసభ్యులు స్పీకర్‌ను కలిసి కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని కూడా వారు హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు.

తాము జగన్ వెంటే ఉంటామని స్పీకర్‌ను కలిసి తర్వాత శాసనసభ్యులు కృష్ణదాసు, కొర్ల భారతి చెప్పారు. మర్యాదపూర్వకంగానే తాము స్పీకర్‌ను కలిశామని, ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని వారు మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము చేసిన రాజీనామాలపై స్పీకర్‌తో చర్చించలేదని వారన్నారు. కృష్ణ దాసు రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు సోదరుడు.

English summary
YSR Congress party president YS Jagan camp MLAs Krishna Das and Korla Bharathi met Assembly speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X