ఈనాడు రామోజీ రావు పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు

Ramoji Rao
హైదరాబాద్: సివిల్ వివాదాన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారించడాన్ని ప్రశ్నిస్తూ ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రఘురాం శుక్రవారం తోసిపుచ్చారు. విశాఖపట్నంలోని ఉషోదయ కార్యాలయం ఉన్న స్థలం యజమాని మంతెన ఆదిత్య ఈశ్వర్‌కుమార్ కృష్ణవర్మ, రామోజీరావు నడుమ స్థలం లీజు వ్యవహారంలో వివాదం తలెత్తింది. ఇందులో క్రిమినల్, సివిల్ కేసులున్నాయి. స్థల యజమానికి తెలపకుండా రోడ్డు విస్తరణ కోసం కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చి దానికి బదులుగా 872 చదరపు మీటర్ల స్థలాన్ని ఈనాడు డైరెక్టర్ పొందారని కృష్ణవర్మ క్రిమినల్ కేసు పెట్టారు.

ముప్పయి మూడేళ్లకు ఇచ్చిన లీజు గడువు ముగిసినందున స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఎవిక్షన్ పిటిషన్ వేశారు. ఈ కేసు (సూట్) ప్రధాన పిటిషన్‌లో సవరణలు కోరుతూ మూడు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. కేసు ట్రయల్ దశలో ఉన్నందున సవరణ పిటిషన్లను కొట్టివేస్తూ.. ఈ కేసును విచారిస్తున్న విశాఖపట్నం 9వ అదనపు సెషన్స్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సివిల్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించడాన్ని ప్రశ్నిస్తూ తమ కేసులను మరో కోర్టుకు బదిలీ చేయాలని రామోజీరావు వేర్వేరు పిటిషన్లతో హైకోర్టును ఆశ్రయించారు. వీటిని విచారించిన హైకోర్టు విశాఖలోని సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ రామోజీ పిటిషన్లను తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+