వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ కాంగ్రెసు జేబు సంస్థగా మారింది: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: సిబిఐ సంస్థ కాంగ్రెసు జేబు సంస్థగా మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం న్యూఢిల్లీలో విమర్శించారు. రైతు పోరు బాట యాత్ర అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఉంటేనే సరియైన న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యర్థులను వేధఇంచేందుకు సిబిఐని కాంగ్రెసు పార్టీ వాడుకుంటుందని విమర్శించారు. అన్ని సంస్థలలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించాలని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. సిబిఐ, రైతు సమస్యలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. కాగా రెండు రోజుల పాటు బాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.

English summary
TDP chief Chandrababu Naidu accused that CBI is going with Congress directions. He went to Delhi to talk about farmers issue with national leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X