ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ఇంటికొద్దన్నందుకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur Map
గుంటూరు/అదిలాబాద్: గుంటూరు జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. అబ్దుల్లా అనే ప్రియుడు వివాహిత బుల్లెమ్మ గొంతు కోసి హత్య చేశాడు. నర్సారావుపేటలోని ఎఫ్ఆర్‌కెటి కాలనీలో ఉంటున్న బుల్లెమ్మకు ఏడాది క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో బుల్లెమ్మ భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఉండే అబ్దుల్లాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అయితే ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో తన ఇంటికి రావద్దని ఆమె ప్రియుడికి చెప్పింది. అది మనసులో పెట్టుకున్న అబ్దుల్లా ఆదివారం ఉదయం బుల్లెమ్మ గొంతు బ్లేడుతో కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బుల్లెమ్మను స్థానికులు హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

అదిలాబాద్ జిల్లాలో అనుమానంతో భర్త సయ్యద్ రఫీ తన భార్యను హత్య చేశాడు. అనంతరం పోలీసులు తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని లక్ష్మణచందా మండలం చామనపల్లిలో చోటు చేసుకుంది.

English summary
A man killed his married lover in Guntur district today. He absconded after attack. Police booked case against accused Abdulla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X