శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరసవిల్లిలో దర్శనమిచ్చిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi
శ్రీకాకుళం: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాలో కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఆమె ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ప్రత్యక్షమయ్యారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా ప్రత్యక్ష నారాయణుడిని దర్శించుకున్నారు.పోలీసు శాఖలో ఐజీగా పనిచేస్తున్న తన భర్త గోపీకృష్ణతో కలిసి ఆమె అరసవల్లి వచ్చారు.

ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి చిన్న ధ్వజస్తంభం ముందు వారిని ఆశీర్వదించారు. శ్రీలక్ష్మి రాకను జిల్లా అధికారవర్గాలు అత్యంత గోప్యంగా వుంచాయి. ఉదయం 11 గంటల సమయంలో ఐజీ స్థాయి అధికారి కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శిస్తారని ప్రచారం చేశారు. భద్రత కట్టుదిట్టం చేశారు. వన్‌టౌన్ సీఐ ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీలక్ష్మి దంపతులు సుమారు 20 నిమిషాలపాటు ఆలయంలోనే గడిపారు. దర్శనానంతరం ధ్వజస్తంభం సమీపంలో దేవున్ని ప్రార్థించారు. అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్లి శ్రీకూర్మనాధున్ని దర్శించుకున్నారు.

English summary
IAS Officer, accused in Gali Janardhan Reddy's case, Y srilaxmi visted Arasavilli of Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X