బాబుపై దర్యాప్తునకు ఈడి రెడీ, ఫెమా కింద విచారణ

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడి ఆస్తులను సీజ్ అవకాశం ఉంది. అయితే కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేసే వరకు ఈడి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఫెమా కింద మాత్రమే దర్యాప్తును ప్రారంభిస్తుంది. సత్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు బి రామలింగ రాజు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అమెరికాలో చదువుకోవడానికి డబ్బులు చెల్లించారని విజయమ్మ చేసిన ఆరోపణపై ఈడి దర్యాప్తు చేస్తుంది. మాదాపూర్లోని భూమిని చంద్రబాబు తల్లి లోకేష్కు ఇచ్చిన ఆస్తిపై కూడా ఈడి దృష్టి పెట్టే అవకాశం ఉంది. నారా లోకేష్ పేరు మీద బెంగళూర్, నెల్లూరు, ముంబై తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములున్నాయని విజయమ్మ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టుకు ఎన్నారైల నుంచి వస్తున్న విరాళాలపై కూడా ఈడి పరిశీలనలోకి తీసుకుంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications