హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలపై అపనమ్మకం, కాంగ్రెసు నిఘా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: సొంత గూటికి చేరే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులను ఓ కంట కనిపెట్టాలని కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసులోకి వస్తున్నప్పటికీ వారి ప్రతి అడుగు గమనించాలని భావిస్తున్నారు. వివిధ కేసుల్లో పీకల్లోతు మునిగిన జగన్ ఏక్షణంలో జైలుకు వెళతారో ఆయన్ను నమ్ముకుంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న దిగులు పట్టి పీడించటం, జగన్ వ్యవహారశైలి కారణంగా వారు తిరిగి పార్టీలోకి వస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వారు ఏ క్షణంలో ఎలాగైనా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.

అంతా బాగుందనుకున్న రోజుల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని, సోనియాగాంధీని బొంద పెడతామని విమర్శలు గుప్పించిన జగన్‌వర్గ నేతలంతా ఇప్పుడు మూకుమ్మడిగా వెనక్కి వచ్చేస్తున్నారు. వారిపై పలువురు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వారిని నమ్మె పరిస్థితి లేదని బాహాటంగానే చెప్పారు. ముందుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా కలెక్టరేట్‌లలో పని చేయడం కాకుండా పార్టీ కార్యాలయాలకు రావాలని హుకూం జారీ చేశారు. అయితే వీటిపై జగన్ వర్గ ఎమ్మెల్యేలు పెదవి మాత్రం విప్పడం లేదు.

కానీ అసెంబ్లీలో ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో పనుల కోసమే తాము కిరణ్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని 2014 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్‌కు అత్యవసరమైతే ఆ సమయంలో తాము తప్పకుండా ఆయన వెంట నడుస్తామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జగన్‌వర్గ ఎమ్మెల్యేల పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇలాంటి వారిని విశ్వసించి 2014 ఎన్నికలకు సిద్ధమైతే కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. అందుకే ఇప్పటి నుంచే ద్వితీయ శ్రేణి నేతలను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు.

English summary
Congress Party is concentrating on YSR Congress Party president YS Jaganmohan Reddy camp MLAs after u turn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X